“ప్రధాన యాజకులు, పెద్దలు, కయప అను ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలో సమావేశమై యేసును ఏదో ఒక కుట్రతో బంధించి, చంపాలని పన్నాగం పన్నారు” (మత్తయి 26:3-4).
ఇదీ యేసు పట్ల యూదులు ప్రవర్తించిన తీరు. యూదులు కోరుకుంది కేవలం యేసు నాశనం అయిపోవటం.. “యేసు ప్రతిదినము దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రధానులును ఆయనను నాశనము చేయజూచుచుండిరి” (లూకా 19:47-48).
ఎప్పుడు యేసు తమ చేతికి చిక్కుతారా ఎప్పుడు ఆయన ప్రాణాలు గాల్లో కలిపేద్దామా అని అనేక దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉండేవారు.. “కాగా ఆ దినము నుండి వారు (యూదులు) యేసును చంపనాలోచించుచుండిరి” (యోహాను 11:53)..
యేసును దొరికిన చోట దొరికినట్లు చంపేసేంత వెర్రికోపంతో ఆనాటి యూదులు రగిలిపోయేవారు.. “అప్పుడు వారు వెర్రి కోపముతో యేసును ఏమి చేయుదుమా అని ఒకనితో ఒకడు మాట్లాడుకున్నారు” (లూకా 6:11)..
ఎక్కడ దొరికితే అక్కడ రాళ్లతో కొట్టి చంపేయటానికి మాటువేసుకుని కూర్చునేవారు కానీ యేసు దుర్మార్గులైన యూదుల చేతుల్లో తన ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు.. “కాబట్టి వారు యేసు మీద రాళ్లు ఎత్తిరి గానీ యేసు దాగి దేవాలయములో నుండి వెళ్లిపోయేను” (యోహాను 8:59)..
దుర్మార్గులైన యూదులు రాళ్లతో కొట్టి చంపేయటానికే కాదు కొండపై నుండి గెంటి తోసేసి ఆయన్ని చంపేసే ప్రయత్నం కూడా చేశారు..
“ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తల క్రిందులుగా పడత్రోయవలెనని కొండ పేటు వరకు ఆయనను తీసుకొనిపోయిరి. అయితే యేసు వారి మధ్య నుండి దాటి తన మార్గమున పోయెను” (లూకా 4:28:30)..
యేసు దుర్మార్గులైన యూదుల నుండి తన ప్రాణాలు కాపాడుకోవటానికి ఊళ్లు కూడా దాటిపోయేవారు .. “అటు తరువాత యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యూదయాలో సంచరించక గలిలయలో సంచరించుచుండెను” (యోహాను 7:1)..
యూదులు తనను చంపటానికి పన్నుతున్న ప్రతీ కుట్రను కనిపెట్టి యేసు వారి నుండి తప్పించుకుంటూ తిరిగేవారు.. “అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్లిపోయేను” (మత్తయి 12:14)..
యేసు చివరకు తనను చంపటానికి కుట్రలు పన్నుతున్న యూదులతో “నన్ను చంపటాని అనేక ప్రయత్నాలు చేస్తున్న మీరు నిర్వర్తిస్తుంది సాతాను సంకల్పం మాత్రమే” (యోహాను 8:39-44) తప్పితే దేవుని సంకల్పాన్నేమీ మీరు నిర్వర్తించటం లేదని హెచ్చరించారు కూడా!
చివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నాటి యూదులు రోమా గవర్నమెంటు సహాయంతో శిలువపై వ్రేలాడదీసి చంపటానికే కుట్రలు పన్నారు. “ఆయనపై ఉమ్ములు వేశారు, గుద్దారు” (మత్తయి 26:67).. “యేసును సంహరించటానికి జనసమూహాన్ని ప్రేరేపించారు” (మత్తయి 27:20)..
యేసును ఏదోలా చంపాలన్న ఆక్రోశంతో రగిలిపోయిన యూదులు “యేసును సంహరించుము, సంహరించుము సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు పెట్టారు” (యోహాను 19:15).. కానీ, ఎందుకో ఓ నీతిమంతుణ్ణి చంపటం ఇష్టం లేని రోమన్ రాజు పిలాతు యూదుల కుట్రలో పాలుపంచుకోవటం ఇష్టం లేక, మనస్సులో తాను చేస్తున్నది పాపమని గ్రహించాడు.. “ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను”.. కానీ, యేసు నాశనాన్నే కోరుకున్న యూదులు “వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక” (మత్తయి 27:24,25).. అని శాపాన్ని చేజెతులారా కొని తెచ్చుకున్నారు దుర్మార్గులైన యూదులు..
కానీ, “అతడు గోతిలోనికి పోడు చనిపోడు” (యెషయా 51:14) అన్న లేఖనం ప్రకారం యేసు శిలువ మరణం నుండి కాపాడబడ్డారు.. “యేసు ప్రాణమును తీయటానికి ప్రయత్నించిన యూదులు ఆయన చనిపోయినట్టుగా భ్రమకు గురయ్యారు” (కీర్తనలు 40:14)..
యేసుకు ముందు వచ్చిన ప్రతీ ప్రవక్తనూ యూదులు అన్యాయంగా చంపుతూవచ్చారు. వారికి ప్రవక్తలను అలవోకగా చంపేయటం తరతరాలుగా వస్తున్న అలవాటు. చివరకు యేసునూ చంపటానికి ప్రయత్నాలు చేసిన యూదులు, ఆయన నోట శపించబడ్డారు.. “నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకుని బలిపీఠమునకు, దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జెకార్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయూ మిమీదికి వచ్చును” (మత్తయి 23:36,37)..
అనేక మంది ప్రవక్తలను చంపిన యూదుల గురించి యేసు.. “సర్పములారా, సర్పసంతానమా, నరక శిక్షను మీరేలాగు తప్పించుకుందురు?” (మత్తయి 23:29,37) అని శపిస్తున్న దానిని బట్టి యేసు దృష్టిలో యూదులు ఎలాంటివారో తెలుస్తుంది. తన ప్రాణాన్ని తీయాలని చూసిన యూదుల గురించి “నరక శిక్ష మీరు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను” అని ఆగ్రహంతో యేసు ఊగిపోవటాన్ని బట్టి యూదులు ఎంతటి దుర్మార్గులో అర్థం చేసుకోవచ్చు.
యూదుల దుర్మార్గాలకు ప్రతిఫలంగా “కాబట్టి దేవుని రాజ్యము మీ నుండి తొలగించబడి దాని ఫలమియ్యు జనులకియ్యబడునని” (మత్తయి 21:33-46) యేసు నోట మరొక చోట ఘోర శాపానికి గురయ్యారు.
ఈ శాపాన్ని బట్టే.. 70 AD లో ‘టైటస్’ అనే రోమన్ రాజు ఆధ్వర్యంలో జెరూసలేం దారుణంగా ధ్వంసం చెయ్యబడింది. వారికి ఒకప్పుడు ఇవ్వబడిన పాలస్తీనా భూభాగం నుండి వారు తరిమివెయ్యబడ్డారు. 2000 సం.ల వరకు నిలువనీడ లేకుండా ప్రపంచదేశాల్లో తరిమివెయ్యబడ్డారు. తిరిగి 1947 తరువాత పాలస్తీనాను ఆక్రమించుకోవటానికి అనేక కుట్రలు పన్ని పాలస్తీనియన్లను చంపి వారి సమాధులపై ఇశ్రాయేలు దేశాన్ని నిర్మించుకోవటం మొదలెట్టారు.
అయితే దుర్మార్గులైన యూదులు తమ నాయకుడైన యేసును అన్యాయంగా శిలువ శిక్షకు గురిచేశారన్న ఆక్రోశం ఒకనాటి క్రైస్తవుల్లో ఉండేది.. ముఖ్యంగా 1099 నుండి 1260 మధ్యలో రోమన్ క్యాథలిక్కులు చేసిన క్రుసేడ్లు యూదులు అన్యాయంగా యేసుపై చేసిన దౌర్జన్యానికి ప్రతీకారంగా చేసిందే. అందులో వేలకొద్దీ యూదులు చంపబడ్డారు..
కానీ, బైబిల్ అవగాహన లేని నేటి క్రైస్తవుల్లో కొందరు అమాయకులు మటుకు యూదులు తిరిగి తమ దేశాన్ని స్థాపించుకోవాలని, వారు తిరిగి ఎత్తబడాలని కన్నీటి ప్రార్ధనలు చేస్తూ ఉంటారు. కనీసం యూదులు యేసును మెస్సీయగా ఆనాడే కాదు ఈనాటికీ ఒప్పుకోరు. యేసు ఒక కల్పిత పాత్ర అని చెబుతుంటారు.
అయినప్పటికీ ఇక్కడి అమాయక క్రైస్తవ జనం మటుకు ఇస్రాయేలీయుల బాగు కోసం తహతహలాడిపోయి వారి కోసం తెగ ప్రార్ధనలు చేస్తూ ఉంటారు. యూదులు మటుకు పాలస్తీనాలో ఉన్న మస్జిదే-అక్సా దగ్గర ఉన్న ‘వైలింగ్ వాల్’ పై తల పెట్టి తమను పాలించే మెస్సియ త్వరగా రావాలని, వచ్చి తమను పాలించాలని కన్నీటి ప్రార్ధనలు చేస్తుంటారు.
వాస్తవాలు తెలుసుకోకుండా యేసును చంపటానికి అనేక కుట్రలు పన్ని.. యేసు నోట శపించబడిన యూదులంటే వల్లమాలిన అభిమానం చూపే కొందరు క్రైస్తవులు నిజంగా అమాయకులే కాదు ఈనాటికీ యేసును నమ్మని యూదులు ఎత్తబడాలని వారి కోసం ప్రార్ధించే క్రైస్తవులు ఒట్టి గొర్రెలే అనటం అతిశయోక్తి కాదేమో
Md Nooruddin
యేసును చంపాలని కుట్ర పన్నిన యూదులను సమర్థించే అమాయక క్రైస్తవులు
